పదోతరగతి పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తాం

పదోతరగతి పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో మార్చి 23 నుంచి 29 వరకు జరగాల్సిన పరీక్షలు హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడ్డాయి. రాష్ట్రం మార్చి 19న ప్రారంభమైన పరీక్షలు 22 వరకు జరిగాయి. ఈ నేపథ్యంలో మిగిలిన పరీక్షలను మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 6 వరకు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో, పరీక్షల తేదీలను మరోమారు ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ప్రకటించారు. 


Popular posts